సిరా న్యూస్,మన్యం;
ఉమ్మడి విశాఖ జిల్లా మన్యంలో చలి పులి విఝృంభిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతన్నాయి. పాడరు లంబసింగి మినుములూరులతో ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపిస్తోంది. మిచాంగ్తుఫాను తరువాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పు ఏర్పడటంతో చలి విఝృంభిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. పాడేరులో 13 డిగ్రీల కనిష్ఠ, 23 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత లు నమోదవుతున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు దిగజారుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది.మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే ఎండ కాస్తుండగా, మిగిలిన సమయంలో చలి కొనసాగుతున్నది. చింతపల్లి మండలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. 14.5 డిగ్రీలకనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి తెలిపారు. పగలు, రాత్రి తేడా లేకుండా చల్లగాలులు వీస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి మరుసటిరోజు ఉదయం పది గంటల వరకు మంచు దట్టంగా కురుస్తున్నది. మంచు ఉధృతి వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా నెలాఖరునాటికి కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయని, చలి తీవ్రత పెరుగుతుందని ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.