మహనీయుల ఆశయాలను కొనసాగించాలి..

సిరా న్యూస్, ఓదెల:

మహనీయుల ఆశయాలను కొనసాగించాలి..

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలో బుధవారం కొలనూర్ రైల్వే గేట్ వద్ద సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి, చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులతో ఘన నివాళులర్పించారు. మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య, చత్రపతి శివాజీ చిత్రపటాలకు పూలమాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక దొడ్డి కొమురయ్య అని శ్లాఘించారు. భారత దేశం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే యోధుడు శివాజీ అని, తల్లి భారతావని విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప దేశ భక్తుడు, హిందూ సామ్రాజ్యా స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ అని కొనియాడారు. వారినీ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని, వారి ఆశయాలను సాధన కోసం పోరాటాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దల గట్టు యాదవ్, దొడ్డ శంకర్ , సతురి రాజేశం, కసారపు శ్రీనివాస్, సామ మోహన్ కుమార్, శివరామకృష్ణ, గడ్డం బన్నీ , ఈద కిషోర్, గంట శ్రీనివాస్, ఓదెలు, మేకల కారక మోహన్ రెడ్డి, వి స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *