మహాలక్ష్మి,రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకలను ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే..

బోథ్ (సిరా న్యూస్)

మహాలక్ష్మి,రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకలను ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే.

మహాలక్ష్మి పథకం క్రింద మహిళకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం  పథకం,రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద పేద ప్రజలకు రూ  10 లక్షల  వరకు వైద్య సదుపాయాన్ని అందించే పథకాలను నేడు  బోథ్ పట్టణ కేంద్రంలోని  స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బోథ్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ సంబంధిత శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఎమ్మెల్యే అనిల్  జాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో  వాటిని  త్వరగా  నెరవేర్చాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో  బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్,  జడ్పీటీసీ  సభ్యురాలు సంధ్యారాణి, ఏఎంసి చైర్మన్ రుక్మాన్ సింగ్,ఎంపీపీ సాజన్, మండల కన్వీనర్ నారాయణ్ రెడ్డి,సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి,స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్, కో ఆప్షన్ మెంబర్ తాహిర్ బెన్,మాజీ మండల కన్వీనర్ సదానందం, తలమడుగు మండల కన్వీనర్ తోట వెంకటేష్,ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్, అధికారులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మండల నాయకులు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *