సిరా న్యూస్,రంగారెడ్డి;
మహేశ్వరం ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లు సరిగ్గలేవనిఉద్యోగులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా మంగల్ పల్లి లోని సీవీఆర్ ఇంజినీరింగ్ కలశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో భోజన ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం తో ఉద్యోగుల ఆందోళన, 5000 మందికి రెండుకౌంటర్లు పెట్టడం తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఏర్పాట్లు సరిగ్గా చేయకుంటే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు.