మాదిగల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయండి

సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పందింటి సుబ్బయ్య మాదిగ

సిరా న్యూస్,నెల్లూరు;

ఎస్సీ వర్గీకరణ సాధించడమే ధ్యేయంగా ఏపీ ఎమ్మార్పీఎస్, సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 31వ తేదీన చలో విజయవాడ మహాసభ నిర్వహిస్తున్నట్లు సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలోఎన్ని ప్రభుత్వాలు మారుతున్న మాదిగలను మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
సార్వత్రికఎన్నికల్లో మాదిగలకు టిక్కెట్లు కేటాయించాలని పాటు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించిన వారికే మాదిగలు మద్దతు ఇస్తారని ఆయన ప్రకటించారు. వర్గీకరణతో పాటు మాదిగల హక్కుల సాధనలక్ష్యంగా నెల్లూరు నగరంలో ఫిబ్రవరిలో యుద్ధభేరి మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరిపోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ మాట తప్పిందని విమర్శించారు. వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధరాజకీయ పార్టీల ప్రతినిధులు మాతంగి కృష్ణ, బర్రె శ్రీనివాసులు, వెంకట్రావు మాదిగ, కన్యకేశ్వరరావు, డేగ రాఘవేంద్ర ముదిగొండ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
===========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *