సిరా న్యూస్, నిర్మల్:
మిత్రుడి కుటుంబానికి రూ.25500 ఆర్థిక చేయూత
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామానికి చెందిన చల్ల రాజు మృతి చెందాగా, బాధిత కుటుంబ సభ్యులకు అతని చిన్ననాటి మిత్రుల అండగా నిలిచారు. గుండెపోటుతో మరణించిన రాజు కుటుంబ సభ్యులకు రూ. 25500 ఆర్థిక సహాయం అందించి, ఆదర్శంగా నిలిచారు. తమ చిన్ననాటి మిత్రుడు చనిపోవడంతో తలా కొంత పోగుచేసి చేసి రూ. 25500 ల నగదును చల్ల రాజు భార్య జ్యోతి కి అందజేశారు. సల్ల రాజు కూతురు పేరు మీదుగా ఫిక్స్ డిపాజిట్ చేయించారు. వివరాల్లోకి వెళితే… సల్ల రాజు ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యాడు. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లి వచ్చిన 15 రోజులకే చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు నిండుకున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోవడంతో, అతని మిత్రులు తుమ్మలపల్లి నరేష్, అజీమ్ కృష్ణమూ,ర్తి కాలేరి దివాకర్, డి రాజేశ్వర్, సంద రాకేష్, వేల్పుల అశోక్, ఆడెపు శ్రీనివాస్, సునీల్, మేసు గంగేశ్వర్, జలంధర్, తదితరులు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.