మిర్యాలగూడ బాయ్స్ గురుకుల పాఠశాలలో మాక్ పార్లమెంట్…

  1. సిరాన్యూస్, సూర్యాపేట్: 

మిర్యాలగూడ బాయ్స్ గురుకుల పాఠశాలలో మాక్ పార్లమెంట్...

+ఉత్సహంగా పాల్గొన్న విద్యార్థులు
అభినందించిన ఉపాధ్యాయులు

సూర్యాపేట జిల్లా చివ్వలం మండలంలో మంగళవారం  మిర్యాలగూడ బాయ్స్ గురుకుల (పాఠశాలలో విద్యనుభ్యసిస్తున్న విద్యార్థులు యూత్ పార్లమెంట్ రీజినల్ లెవెల్ కార్యక్రమం నిర్వహించారు . దీనిలో భాగంగా స్పీకర్ పదవి బాధ్యతగా ఎండీ  మోయిజ్ ప్రధానిగా, నవదీప్ అపోజిషన్ ఎంపీలుగా, వికాస్, ఫైనాన్స్ మినిస్టర్  గా,  సతీష్ఎడ్యుకేషనమినిస్టర్,హర్షిత్ పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమం నందు పాల్గొనడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం వలన పిల్లలకు సమాజం పట్ల, రాజకీయం పట్ల అవగాహన దృక్పథం ఏర్పడుతుందని ప్రిన్సిపల్ ఆర్ రవీంద్ర ప్రసాద్  తెలిపారు. దీనిలో భాగంగా ఆ పాఠశాల పిజిటి సోషల్ స్టడీస్ డి శంకర్ నాయక్, టీజీటీ సోషల్ స్టడీస్ పుల్లయ్య నాయుడు,  టీజీటీ సోషల్ స్టడీస్ ఆర్ నాగేశ్వర్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న  విద్యార్థులను  అభినందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *