సిరా న్యూస్,శ్రీకాళహస్తి;
నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన పలువురు వన్నెరెడ్ల కుటుంబాలకు ఎమ్మెల్సీ, రష్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం అండగా నిలబడ్డారు. వారికి కుటుంబాలకు నెలకు సరిపడా ఇంటి సరుకులు అందజేసి భరోసాగా నిలిచారు. శ్రీకాళహస్తి మండలంలోని టీఎంవీ కండ్రిగకు చెందిన వరదారెడ్డి, తొట్టంబేడు మండలం జ్ఞానామకండ్రిగ చెందిన కామాక్షమ్మ ఇటీవల మృతి చెందారు. వీరిరువురి కర్మ క్రియలు బుధవారం జరిగాయి. వారి కర్మ క్రియలకు హాజరైన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మృతుల కుటుంబాలను పరామర్శించారు. నెలకు సరిపడా 41 రకాల నిత్యావసర సరుకులను అందజేశారు. వన్నె కుల క్షత్రియ సామాజికవర్గ నేతగా తాను ఎప్పుడూ పేదలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సిపాయితో పాటు నాయకులు గురవారెడ్డి, బత్తిరెడ్డి, భరత్ రెడ్డి, రత్నం రెడ్డి పాల్గొన్నారు.