సిరా న్యూస్, కడెం:
రామ మందిరం అక్షింతలు ఇంటింటా పంపిణి..
అయోధ్య రామ మందిరం నుండి తీసుకొచ్చిన అక్షింతలను సోమవారం కడెం మండల కేంద్రంలో గ్రామా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఇంటింట తిరుగుతూ అక్షింతలను ఇచ్చి వాటిని పూజించే విధానం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పాలకుర్తి కృష్ణ, భూపాల్, లింగాల ప్రభాకర్, ప్రకాష్, సురేందర్, నడిగోటి నరేష్, పాలకుర్తి నగేష్, జింబర్తి వెంకటరమణ, తదితరులు పాల్లగొన్నరు.