రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి…

సిరా న్యూస్, చిగురుమామిడి:

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి…

ఈ నెల 3న కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొహెడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అరవింద్ మంగళవారం మృతి చెందినట్లు చిగురుమామిడి ఎస్ఐ బండి రాజేష్ తెలిపారు. మృతుని భార్య బుర్ర జోష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన శ్రీకాంత్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *