సిరా న్యూస్,రాజమండ్రి;
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపు సావరంలో దూళ్ళ సత్య శ్రీ (35) వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. సత్యశ్రీ భర్త సూర్యప్రకాష్ (సూరిబాబు) హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దంపతుల మధ్య గత మూడు నెలలుగా ఏర్పడిన వివాదమే హత్యకు దారితీసి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. కాగా ఇరువురు దంపతులకు పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరించారు. వీరికి 16 ఏళ్లు క్రితం ప్రేమ వివాహం జరిగిందని, ఒక పాప, బాబు సంతానం ఉండగా, పాప ఐదవ తరగతి, బాబు ఎనిమిదవ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని సౌత్ జోన్ డిఎస్పి అంబికా ప్రసాద్, కడియం సీఐ బి తులసీదర్ పరిశీలించారు. భర్త పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.