వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు

– ధనుర్మాసంలో డిసెంబరు 17 నుండి జనవరి 14 వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠనం
డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో  ఎవి.ధర్మారెడ్డి
సిరా న్యూస్, తిరుమల;
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో  ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *