సిరా న్యూస్,తిరుపతి;
శ్రీవారి వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం శుక్రవారం తెల్లవారుజామునుంచి భక్తులు బారులు తీరారు. తిరుపతిలోని ప్రత్యేక కౌంటర్ల వద్ద టోకన్ల జారీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసారు. వైకుంఠ ఏకాదశి కి తరలి వచ్చారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పది ప్రాంతాలలో కౌంటర్లలో టికెట్లు జారీ చేస్తున్నారు. అన్ని ప్రాంతలలో భక్తులు కిక్కిరిసారు. ఏకాదశి కి… ఒకరోజు ముందుగానే భక్తులు చేరుకున్నారు. తుడా గ్రౌండ్స్, రామచంద్ర పుష్కరిణి, ముత్యాల రెడ్డి పల్లి ఉన్నత పాఠశాల కౌంటర్ల వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు