సిరా న్యూస్, పెంబి:
వైభవంగా గోదాదేవి రంగనాథుల కళ్యాణోత్సవం…
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని హరి హర దేవాలయంలో గోదాదేవి రంగనాథుల కల్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ శైవక్షత్ర వానితాశక్తి ఆధ్వర్యంలో ఒడి బియ్యం గోదా దేవి రంగనాతులకు సమర్పించారు. ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదమంత్రాలు భాజా భజంత్రీల నడుమ భక్తులంత తన్మయత్వంతో చూస్తుండగా గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కల్యాణ మహోత్సవ వేడుకలకు తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల కోసం మహాన్నదానం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ అధ్యక్షులు సల్ల రమేశ్వర్ రెడ్డి, నాయకులు ఆమెడ శంకర్, పార్వతల లక్ష్మీనారాయణ, గన్నరపు సురేష్, పుప్పాల నర్సయ్య, రాజలింగు, సుతరి మహేందర్, మోహన్, బచ్చు మనోహర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.