సిరా న్యూస్, సైదాపూర్:
శవ యాత్ర పేరుతో గెలిచిన కౌశిక్ రెడ్డి… ఖబర్దార్
+ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని మహేష్ గౌడ్ వార్నింగ్
బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడే స్ధాయి ఎమ్మేల్యే కౌశిక్ రెడ్డి కి లేదుని కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం కోఆర్డినేటర్ అనగోని మహేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పేప్పర్ స్ప్రే కు గురైన, వెనుకడుగు వేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అని అన్నారు. మనుకోటలో తెలంగాణ ఉద్యమ కారులపై రాళ్ళు రువ్విన కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ రెడ్డిని విమర్శించడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసిఆర్ మెప్పు పొందాలని పిచ్చి ప్రేళపనలు పేలితే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. కౌశిక్ రెడ్డికి గతంలో 2018 లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ బర్తరఫ్ చేయాలా..? అని ప్రశ్నించారు. ఓట్లు వేసి గెలిపించక పోతే శవ యాత్రలో పాల్గొనండి, అని మాట్లాడి భార్య బిడ్డలను మధ్యలో పెట్టుకొని సెంటిమెంట్, సింపతితో ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డికి మంత్రిని విమర్శించే స్థాయి లేదన్నారు. ఇకనుంచి విమర్శలు చేస్తే ఉపేక్షించేది లేదని వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు…