శాస‌న‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

మండిపడ్డ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు

సిరా న్యూస్,హైద‌రాబాద్;
శాస‌న‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించార‌ని సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మండిపడ్డారు. వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచాల్సిన అవ‌స‌రం ఉం శాస‌న‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించార‌ని ద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. త‌న‌కేదో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ద‌వి ఇచ్చింద‌ని రేవంత్ రెడ్డి అన‌డం స‌రికాద‌న్నారు హ‌రీశ్‌రావు. శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌కు హ‌రీశ్‌రావు వివ‌ర‌ణ ఇచ్చారు.ఈ స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు చేశారు. సీఎం మాట్లాడుతూ పోతిరెడ్డి ప్రాజెక్టుపై మా నాయ‌కులే కొట్లాడారు.. రాజ‌శేఖ‌ర్ రెడ్డి కేబినెట్‌లో ఉన్న‌టువంటి మంత్రులు మాట్లాడ‌లేద‌ని ఆయ‌న అన్నారు. దాని మీద వీలైతే చ‌ర్చ పెట్టండి. స‌భ రికార్డులు తీసి బ‌య‌ట‌పెట్టింది. వీడియో ఫుటేజీ కూడా స‌భ‌లో ఉంట‌ది.. అది కూడా బ‌య‌ట‌పెట్టండి. అన్ని విష‌యాలు బ‌య‌ట‌పెడితే దాని మీద నేను చ‌ర్చ‌కు సిద్ధం. ఆ రోజు రాజ‌శేఖ‌ర్ రెడ్డి కేబినెట్‌లో ఆరుగురు మంత్రులు ఉన్నాం. 14 నెల‌ల‌కే రాజీనామా చేశాం. ఆరు కార‌ణాలు చెప్పి రాజీనామాలు చేశాం. మొద‌టి కార‌ణం ఏంటంటే.. అక్ర‌మంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క కొట్టి మా తెలంగాణ‌కు ద‌క్కాల్సిన కృష్ణా జ‌లాల‌ను రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించుకుపోతున్నందుకు నిర‌స‌న‌గా, ఈ కేబినెట్ నుంచి మేం వైదొల‌గుతున్నాం. తెలంగాణ‌ను ముంచి ఆంధ్రాకు నీళ్లు మ‌ళ్లించే పులిచింత‌ల ప్రాజెక్టును ఆప‌క‌పోవ‌డం వ‌ల్ల కేబినెట్‌కు రాజీనామా చేస్తున్నామ‌ని చెప్పాం. 610 జీవో అమ‌లు చేయ‌డం వ‌ల్ల నిర్ల‌క్ష్యం కార‌ణంగా, మా తెలంగాణ పిల్ల‌ల‌కు ఉద్యోగాలు దక్కే విష‌యంలో మా మాట త‌ప్పుతున్నందుకు నిర‌స‌న‌గా రాజీనామా చేస్తున్నామ‌ని చెప్పాం. న‌క్స‌లైట్ల‌తో చ‌ర్చ‌ల పేరిట ఫేక్ ఎన్‌కౌంట‌ర్లు చేస్తున్న‌రు అని చెప్పి రాజీనామా చేస్తున్నామ‌ని చెప్పాం. ఇలా ఆరు కార‌ణాలు ఇదే స‌భ‌లో, బ‌య‌ట చెప్పి మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన విష‌యాన్ని సీఎం దృష్టికి తీసుకువ‌స్తున్నాను అని హ‌రీశ్‌రావు వివ‌ర‌ణ ఇచ్చారు.
45 రోజులు నిర‌స‌న వ్య‌క్తం చేశాం..
ఇదే స‌భ‌లో అదే పోడియంలో నేను ప‌ద్మారావు గౌడ్ క‌లిసి పోతిరెడ్డిపాడును ఆపాల‌ని 45 రోజులు నిర‌స‌న వ్య‌క్తం చేశాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క పీజేఆర్ మాత్ర‌మే కొట్లాడారు. ఆ రోజు మంత్రులుగా ఉన్న చాలా మంది పెద‌వులు మూసుకుని ఇక్క‌డ‌ కూర్చున్నారు. ఆ రోజు మాతో గొంతు క‌లిపింది పీజేఆర్ మాత్ర‌మే. ఆ పీజేఆర్ త‌న‌యుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి కూడా మాతోనే ఉన్నార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *