సిరా న్యూస్, ఆదిలాబాద్:
శౌర్య దివస్ ని విజయవంతం చెయ్యండి :మాజీ ఏమ్మెల్యే జోగు రామన్న
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో జనవరి 1న నిర్వహించనున్న భీమా కోరేగావ్ దివస్ ని విజయవంతం చెయ్యాలని మాజీ ఏమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం పట్టణంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షులు భీంరావ్ వాగమారే, ప్రధాన కార్యదర్శి దాదాసాహెబ్ జాబాడే, మాత రమాయి ,మహిళా సంఘం అధ్యక్షురాలు చంద్రకళ వాగమారే, లతో కలిసి గోడ పత్రులను విడుదల చేశారు.