- సిరా న్యూస్, ఆదిలాబాద్ (సోనాల):
అదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో విద్యార్థులకు నమూనా పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా నమూనా ఎన్నికల్లో పాల్గొని, నామినేషన్లు దాఖలు చేసారు. కాగా బ్యాలెట్ పేపరు ద్వారా ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియలను విద్యార్థులు స్వయంగా నిర్వహించారు. అనంతరం ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎన్నిక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ… ఓటింగ్, ఎన్నికల విధానం పై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.