సిరా న్యూస్, గుడిహత్నూర్:
స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు…
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం స్వదేశీ జాగరన్ మంచ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఈ మేరకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వదేశీ జాగరణ మంచ్ అదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ నాగుల సతీష్ మాట్లాడుతూ… స్వామి వివేకానంద జీవితం అందరికీ ఆదర్శనీయమని, యువత వివేకానందుని స్ఫూర్తితో ముందు పోవాలని అన్నారు. భారత దేశ ఔన్నత్యం, సంస్కృతి, సాంప్రదాయాల్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప దార్శనీకుడు స్వామి వివేకానందుడని ఆయన అన్నారు. భారతీయ ఆధ్యాత్మిక సందేశాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని దేశం నలుమూలలా తన ప్రసంగాల ద్వారా విస్తరింపజేసీ, జాతి హితం కోసం కృషీ చేసిన మహనీయుడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ సూరత్ సింగ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆడే సునీల్, బిజెపి మండల ఉపాధ్యక్షుడు తరుణ్ గిత్తే, కళాశాల అధ్యాపకులు నాగరాజు, నాయకులు గాజుల శ్రీనివాస్, సి. రాజేశ్వర్, రత్నాకర్, జ్ఞానేశ్వర్, రాజేశ్వర్, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.