సిరా న్యూస్, పెద్దపల్లి:
హమీలపై స్పష్టత ఇవ్వని కాంగ్రెస్ సర్కార్..
సాగు..తాగునీటిపై ముందస్తు చర్యలు తీసుకోవాలి..
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్..
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ ఫుట్ట మధూకర్ అన్నారు. సోమవారం ఎన్ టి పి సి మిలీనియం హాల్లో జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల్లో ముఖ్యమైన ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ విషయంలో స్పష్టత లేదన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల అర్హత విషయంలో అధికారులు ఎలాంటి గైడ్లైన్స్ రాలేదని,ఎవరికి ఇవ్వాలనే విషయంపై స్ఫష్టత ఇవ్వడం లేదన్నారు. స్థానికి సమస్యలను అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని. ఇందులో బాగంగా వేసవి కాలం సమీపిస్తున్న క్రమంలో తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఎస్సారెస్పీ ద్వారా సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని. ఈ విషయంలో అదికారులు ప్రత్యేక దృష్టిసారించి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఓదెల జడ్పీటీసీలు గంట రాములు, తగరం సుమలత, మ్యాధరబోయిన శారద, ఆముల నారాయణ, పూస్కురి పద్మజ, ఎంపీపీ లు తానిపర్తి స్రవంతి, బండారి స్రవంతి,కుసుకుంట్ల రమాదేవి, ముత్యాల కరుణ శ్రీ, వ్యాల అనసూర్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.