అర్హులందరికీ సంక్షేమ పథకాలు..

 సిరా న్యూస్, తలమడుగు:

 అర్హులందరికీ సంక్షేమ పథకాలు

– జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఖోడద్, ఉండం గ్రామాలలో ప్రజా పాలన కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… 100 రోజుల్లో 6 గ్యారంటీలో అమలు చేసి తీరుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మహావీర్, ఎంపీడీవో రవీందర్, గ్రామ సర్పంచ్ సాకి ఆనంద్, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, నాయకులు రమేష్ రెడ్డి, కమలాకర్, వెంకన్న యాదవ్, కో అప్షన్ మెంబర్ బాబు ఖాన్, మాజీ సర్పంచ్ లస్మన్న, మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీక్, నాయకులు దేవిదాస్, సంతోష్, పోతన్న, రాంచందర్ దేశ్ ముక్, నర్సింలు, రావుల నారాయణ, పోశెట్టీ, షారుక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *