– యుటిఎఫ్
సిరా న్యూస్,బద్వేలు;
రాష్ట్రంలో అమలు జరిపిన 117 జీవో ఫలితంగా రాష్ట్ర విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం సడలిపోతున్నదని దీని వలన ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోతున్నాయని పరిస్థితులు విషమించకముందే ప్రభుత్వం మేల్కొని 117 జీవో రద్దు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కోరారు.రాష్ట్ర సంఘం పిలుపుమేరకు విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి నివాసంలో ఆమెను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు సుదీర్ఘకాలంగా ఆపరిష్కృతంగా వున్నాయని,పెరిగిన పనిభారంతో బాటు సమస్యలు పరిష్కారంకాక ఉపాధ్యాయుల అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉన్నదని క్రింది సమస్యలన్నిటికి తగిన పరిష్కారం చూపే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని కోరారు. ప్రధానంగా జిఓ 117 రద్దు చేసి జిఓ 53 ప్రకారం టీచర్లను కేటాయించాలని,ప్రీప్రైమరితో బాటు 1 నుండి 5 తరగతులను ఒకే పాఠశాలగా నడపాలని,రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సిలబస్ ఒకే పరీక్షా విధానం అమలు చేయాలని కోరారు.హైస్కూలల్లో రెండు మీడియంలను సమాంతరంగా కొనసాగించాలని,ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుండి మినహాయించాలని,హైస్కూలల్లో నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించాలని, ఒక కిలోమీటర్ పైబడి దూరం నుండి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.స్థానిక ప్రాంతాల పరిస్థితులను బట్టి మధ్యాహ్న భోజన పథకం మెనూ సవరించాలని,మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో పోస్టులను అప్గ్రేడ్ చేసి ప్రమోషన్లు, బదిలీలు వెంటనే జరిపించాలని,పిఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.కోవిడ్ సమయంలో మరణించిన మోడల్ స్కూల్ టీచర్ల వారసులకు కారుణ్య నియామకాలు కల్పించాలని,సర్వీస్ రూల్స్ వెంటనే విడుదల చేసి పిజిటిలకు జూనియర్ లెక్చరర్ హోదా కల్పించాలని తెలిపారు.ఎయిడెడ్ నుండి స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అబ్జర్బ్ అయిన ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని,ఎయిడెడ్ పాఠశాలల ఖాళీలను భర్తీ చేసేందుకు తగు చర్యలు గైకొనాలని కోరారు.మినిమమ్ టైంస్కేల్ ఉపాధ్యాయులు మరియు సి ఆర్ ఎం టి ల సర్వీస్లను రెగ్యులరైజ్ చేయాలని,ప్లస్ టూ పాఠశాలల్లోని పిజిటి పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వాలని తెలిపారు.పాఠశాలలకు రావలసిన అన్ని రకాల గ్రాంట్లు మంజూరు చేయాలని,విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని,వేసవి సెలవులలో నాడు-నేడు, ప్లస్ టూ తరగతులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవు మంజూరు చేయాలని కూడా తెలిపారు.పై సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందించి ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి సహకారం అందించాలని కోరారు.కార్యక్రమంలో ట్రెజరర్ నరసింహారావు జిల్లా కార్యదర్శి ఏజాస్ అహ్మద్ ఆడిట్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్ నాయకులు కృష్ణారెడ్డి,మజ్జారి చెన్నకేశవులు కొండయ్య బత్తుల చంద్రశేఖర్ గోపీనాథ్ కరిముల్లా హిపాజతుల్లా వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు.