సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
తాడేపల్లిగూడెం మండలం పడాల శ్రీ సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత ఆశ్రమంలో శనివారం గురువర్యులు సజ్జ రామ్మూర్తి 127 వ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఆకుల శ్రీరాములు హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వంద మందికి వైద్య పరీక్షలు నిర్వహించి హోమియో మందులు అందజేశారు. ఆశ్రమంలోని గోశాలలో గోవులకు పూజా అధికారులు నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి భోజనానందగిరి స్వామి పూజారికాలను పర్యవేక్షించగా హోమియో వైద్యులు ధనాల సాయిరాం, వైద్య పరీక్షలు నిర్వహించారు.
========================