చిగురుమామిడి, సిరా న్యూస్
ఈనెల16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో గ్రామీణ భారత్ బందులో భాగంగా చిగురుమామిడి మండలంలోని తెలంగాణ ఆశ వర్కర్స్ (సి. ఐ. టీ. యూ) యూనియన్ చిగురు మామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ విప్లవ శ్రీ గారికీ సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఆశ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీలత మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆశ వర్కర్లకు అన్యాయం చేస్తుందని, ఆశాలతో 18 సంవత్సరాల నుండి వెట్టిచాకిరి చేయించుకుంటుందని, ఆశాలను.కార్మికులుగా గుర్తించడం లేదని, కనీస వేతనము ఇవ్వడం లేదని, సి ఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదని ఆమె అన్నారు కేంద్ర ప్రభుత్వంఇప్పటికైనా ఆశవర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం 26, 000లు ఇవ్వాలని, స్కీమ్ వర్కర్ల బడ్జెట్లో కోత పెట్టకూడదని అందుకని దేశంలోని స్క్రీన్ వర్కర్లు, కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారనిఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు పెద్దపల్లి శోభ, ప్రధాన కార్యదర్శి నాగెల్లి పద్మ, కమల, పద్మ, తార. తదితరులు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.