సిరా న్యూస్, ఇచ్చోడ:
18 ఏళ్లు నిoడిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి..
కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ విశ్వబోధి గాయక్వాడ్..
18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ విశ్వబోధి గాయక్వాడ్ అన్నారు.ఇచ్చోడా మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అయినా మాట్లాడుతూ : ఎన్నికల సంఘం మరోసారి అవకాశం ఇచ్చినందున 18ఏళ్లు నిండిన యువతి, యువకులు సద్వినియోగం చేసుకొవాలని కోరారు. గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ తమ గ్రామాలలో 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి వారికి ఓటు హక్కు నమోదు చేయించాలని పిలుపునిచ్చారు.