శ్రీ సత్య సాయి జిల్లా
సిరా న్యూస్,పుట్టపర్తి నియోజకవర్గం;
కొత్త చెరువు మండల కేంద్రంలోని పెద్ద మసీదు వీధికి చెందిన 20 వైసీపీ కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. పార్టీలోకి చేరిన వారికి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పతకాలునచ్చి పల్లె మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు తెలియజేశారు. 2024 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని గట్టిగా నమ్మకం ఉండడంతో పుట్టపర్తి నియోజకవర్గంలో చాలా మంది సైకిల్ వైపు అడుగులు వేస్తున్నారని వారు తెలిపారు. నియోజవర్గంలో వైసీపీ గల్లంతు కావడం ఖాయమని వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారు పేర్కొన్నారు.
=============