క్రీడలతో మానసిక ఉల్లాసం… తలమడుగు జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి..

సిరా  న్యూస్, బోథ్:

క్రీడలతో మానసిక ఉల్లాసం…

తలమడుగు జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి..

తలమడుగు మండలం దేగామ గ్రామంలో గత 21 రోజుల నుండి జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ నేటితో ముగిసింది బహుమతుల ప్రధానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  గణేష్ రెడ్డి హాజరు అయి బహుమతులను ప్రధానం చేశారు. మొదటి బహుమతి 15 వేల రూపాయలు మహారాష్ట్ర జవర్ల టీం, రెండో బహుమతి పల్సి బి టీం 10 వేల రూపాయలు, మూడో బహుమతి 5000 రూపాయలు కుచులపూర్ టీం లు గెలుపొందాయి. అనంతరం జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలను ఆదివాసి గ్రామాలలో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ  కార్యక్రమంలో త్రియంభక్ ఉపాధ్యాయులు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు రఫీక్, పోషెట్టి, మాజీ సర్పంచ్ గోపాల్, లస్మన్న, కాంతారావు, భాస్కర్, యువజన సంఘ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *