23ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ ద్వారా రూ.540 కోట్ల మొదటి విడత

నిధులు విడుదల చేసిన ప్రధాని మోడీ

సంక్షేమ పథకాల్లో ఎవరూ వదలకూడదనేది కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం

నల్లమల్ల అటవీ ప్రాంతం తెలంగాణకు ఊటీ లాంటిది
– అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

చెంచుల అభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు పరిచిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం
నల్లమల్ల అటవీ ప్రాంతం పర్యాటక రంగంగా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

సిరా న్యూస్,నాగర్ కర్నూల్;

ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్) కింద లక్ష మంది లబ్ధిదారులకు గ్రామీణ గృహనిర్మాణ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై-జీ) మొదటి విడతను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ గిరిజన గురుకుల పాఠశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో మాట్లాడేందుకు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులతో దేశవ్యాప్తంగా నిర్వహించిన పర్చవల్ సమావేశం ద్వారా వివిధ రాష్ట్రాల గిరిజనులతో ప్రధాని వారి
వంటగ్యాస్ కనెక్షన్లు, విద్యుత్, పైపుల ద్వారా మంచినీరు, గృహనిర్మాణం కోసం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్న తర్వాత వారి జీవితాల్లో వచ్చిన సానుకూల మార్పులపై లబ్ధిదారులతో ఆయన ముచ్చటించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ…
మొదటి విడతగా రూ. 540 కోట్లను విడుదల చేసిన ప్రధాని కేంద్ర ప్రభుత్వం పదేళ్ల పాలనను పేదల సంక్షేమానికి అంకితం చేసిందన్నారు.
ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికీ అందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
తమ ప్రభుత్వం పదేళ్లను పేదలకు అంకితం చేసిందని మోదీ పేర్కొన్నారు.
గత దశాబ్దంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమ పథకాల బడ్జెట్ ఐదు రెట్లు పెరిగిందని, గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలు రెండున్నర రెట్లు పెరిగాయని ప్రధాని తెలిపారు.
గిరిజన విద్యార్థుల కోసం గతంలో 90గా ఉన్న ఏకలవ్య మోడల్ స్కూళ్లను 500కు పైగా నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు.
సుమారు రూ. 24,000 కోట్ల బడ్జెట్ తో పీఎం-జన్‌మన్ తొమ్మిది మంత్రిత్వ శాఖల ద్వారా 11 కీలక చర్యలపై దృష్టి సారించిందన్నారు. సురక్షితమైన గృహనిర్మాణం, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, మెరుగైన విద్య, ఆరోగ్యం- పోషకాహారం, విద్యుత్, రహదారి, టెలికాం కనెక్టివిటీ వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడం ద్వారా ముఖ్యంగా బలహీనమైన గిరిజన సమూహాల (పివిటిజి) సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని, అలాగే స్థిరమైన జీవనోపాధి అవకాశాలు అందించాలని భావిస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *