23 లక్షల నగదు స్వాధీనం

సిరా న్యూస్,ఒంగోలు;
ప్రచార పర్వం మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో నియోజకవర్గం లో పోలీసుల నిఘానీడలు అలముకున్నాయి. ఓటుకు నోటును అరికట్టేందుకు పోలీసులు వేట షురూ అయింది. ఎన్నికల నిబంధనావళిలో భాగంగా వేటపాలెం మండలం కఠారిపాలెంలో పోలీసులు మరియు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం సంయుక్తంగా కార్డ్ అండ్ సెర్చ్ చేపట్టారు. విషయం తెలుసుకున్న పామంచి నర్సింహారావు అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న నగదు తో బైక్ పై పొట్టిసుబ్బయ్యపాలెం వెళ్ళుతున్న సమయం లో పోలీసులు అతని విచారించగా అతని వద్ద సుమారు 23 లక్షల రూపాయలు నగదు ఉన్నట్లు గుర్తించారు.అతని వద్ద నుండి ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 22 లక్షల 95 వేల రూపాయల నగదు ను ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో సీజ్ చేసి జిల్లా ఎన్నికల అధికారికి పంపించడం జరుగుతుందని సిఐ సత్యన్నారాయణ తెలిపారు.సీజ్ చేసిన నగదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కు చెందినవిగా పోలీసులు భావిస్తున్నారు
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *