23rd-birthday celebrations of veerareddy in badvel బద్వేల్ లో వీరారెడ్డి 23వ ఘనంగా వర్ధంతి వేడుకలు

నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు

సిరా న్యూస్,బద్వేలు;

బద్వేలు రాజకీయాలను కొన్ని దశాబ్దాల పాటు శాసించిన మంత్రి దివంగత వీరారెడ్డి నడిచిన రాజకీయ చరిత్ర అని తెలుగుదేశం నాయకులు అన్నారు. వీరారెడ్డి 23వ వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. అలాగే ఆయన శత జయంతి వేడుకలు కూడా ఇదే సందర్భంగా నిర్వహించారు. వీరారెడ్డి ఘాట్లో పలువురు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆయన వ్యక్తిగత అభిమానులు సమాధికి పూలమాలలు వేసి నమస్కరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో నెల్లూరు జిల్లా వెంకటగిరి ఉదయగిరి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి కడప పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు అమీర్ బాబు లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తెలుగుదేశం పార్టీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొజ్జ రోశన్న ఆయన శ్రీమతి అరుణ బద్వేల్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సోమేశుల పార్థసారథి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ తదితరులు బహిరంగ వేదిక మీద మాట్లాడారు. వీరారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నారు .రాజకీయాల్లో ఆయన మించిన వారు లేదన్నారు పట్టిన పట్టు వదలకుండా పేదలకు సేవ చేయడమే వీరారెడ్డికి తెలుసు అన్నారు వీరారెడ్డి జీవించి ఉన్నంతవరకు బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చేశారని వారు కీర్తించారు. ఆయన మృతి తర్వాత తెలుగుదేశం పార్టీ బద్వేల్ అసెంబ్లీలో ఒడిదుడుకులు పడుతుందని అయినప్పటికీ ఆయన కుమార్తె మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మనవడు పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీని జరిగే ఎన్నికల్లో గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే రితేష్ కుమార్ రెడ్డి ఈనెల ఏడో తేదీ నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు బద్వేల్ నియోజకవర్గం లో దాదాపు 300 కిలోమీటర్లు నడిచేందుకు రితేష్ సకల్పించినట్లు వారు తెలిపారు రితేష్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తున్నట్లు తెలిపారు. విజయమ్మ రితీష్ కుమార్ రెడ్డి పట్టుదల చూస్తుంటే రానున్న ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని వారు పేర్కొన్నారు. బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని వా భారీ ఎత్తున వచ్చి నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి లింగారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రితేష్ పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చినట్లు తెలిపారు పాదయాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని తెలిపారు. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి మరోసారి కంచుకోట అవుతుందని ఇందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు గట్టిగా కృషి చేయాలని పార్టీ అగ్ర నాయకులు మరి మరి కోరారు ఇంకా పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *