శ్రీశైలమల్లన్న రాబడి 3.87 కోట్లు

హుండీలలెక్కింపులో 15 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలు

సిరా న్యూస్,శ్రీశైలం;
శ్రీశైలభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉభయదేవాలయాల హుండీలలెక్కింపు అక్కమహాదేవి అలంకారమండపములో శుక్రవారం ఉదయంనుండి ప్రారంభించగా రూ.3,87,52,761/-లు నగదు రాబడి వచ్చింది. అదేవిధంగా 263 గ్రాముల 900 మిల్లిగ్రాముల బంగారు,9 కేజీల 700 గ్రాముల వెండితో పాటు వివిధ విదేశీ కరెన్సీకూడా లభించినట్లు కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు.
భక్తులు కానుకల రూపేణా స్వామివార్ల కు 15 రోజులలో
సమర్పించుకున్నదని సమకూరినదని కార్యనిర్వహణాధికారి తెలిపారు.ఈ హుండీలలెక్కింపు కార్యక్రమాన్ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య సిసికెమెరాల నిఘాతోలెక్కింపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, డిప్యూటి కార్యనిర్వహణాధికారి అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, శివసేవకులు పాల్గొన్నారు.
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *