రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

సిరా న్యూస్,విజయవాడ;
కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామం శివారులో బైకును టిప్పర్ ఢీ కొన్న ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతిచెందారు..ముగ్గురిలో తల్లి కొడుకు,మేనల్లుడు కావడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతులు గంపలగూడెం మండలం వినగడప గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ బి (50), షేక్ నాగులు మీరా (28), షేక్ నాగుల్ మీరా (25) గా పోలీసులు గుర్తించారు.జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. పంచనామా నిమిత్తం మృతదేహాలను తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *