సిరా న్యూస్;
హైబ్రీఢ్ కన్నాబిస్(కుష్) పట్టివేత
ముగ్గురు పై కేసు నమోదు చేసిన ఎస్టిఎఫ్ ఎక్సైజ్ పోలీసులు
విదేశాల నుండి దిగుమతి చేసిన హైబ్రీఢ్ కన్నాబిస్ మత్తు మందును తార్నాక డివిజన్ లాలాపేట పరిధిలో అమ్ముతుండగా ఇద్దరు నిందితులను ఎస్టిఎఫ్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్టిఎఫ్ ఎక్సైజ్ సూపరింటెండ్ కే ప్రదీప్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. హైబ్రీఢ్ కన్నాబిస్ (కుష్) మాదకద్రవ్యాన్ని లాలాపేటలో అమ్ముతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టిఎఫ్ ఎస్ఐ బాలరాజు, సిబ్బంది మహేశ్వర్, అరుణ్, యాదగిరి తో కలిసి లాలాపేట బ్రిడ్జి వద్ద మాటువేసి హైబ్రీఢ్ కన్నాబిస్ అమ్ముతున్న లాలపేటకు చెందిన ఆమన్ (మహమ్మద్ ఖాన్), మహమ్మద్ ముబీన్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 23 గ్రాముల కన్నాబీస్ స్వాధీనం చేసుకొని విచారించారు. వారికి మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన నిఖిల్ నాయక్ అనే వ్యక్తి అందించాడని చెప్పడంతో, వెంటనే నిఖిల్ నాయక్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద 10గ్రాముల కన్నాబిస్ ను స్వాధీన పరుచుకున్నారు. ముగ్గురు నుండి 33 గ్రాముల మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిని మహమ్మద్ అబ్దుల్ మోబిన్ బెంగళూరు కు వెళ్లి అక్కడ విదేశీయుల నుండి కొనుగోలు చేసి , హైదరాబాద్ కు తీసుకొచ్చి మహమ్మద్ ఖాన్, నిఖిల్ నాయక్ లు కలిసి యువతకు అమ్ముతారు. దీనిని గ్రామ కు రూ,3500 చొప్పున అమ్ముతారని తెలిపారు. స్వాధీనం చేసుకున్న 33 గ్రాముల మాధకు ద్రవ్యం విలువ రూ,1.32 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ మాదక ద్రవ్యాలు విదేశాల నుండి అక్రమంగా సముద్ర మార్గం ద్వారం బెంగళూరు, కొరెనూర్ కు సరఫరా అవుతున్నట్లు గుర్తించామన్నారు. దీనిని హిందుకుష్ పర్వతశ్రేణుల్లో , ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఎక్కువ పండిస్తారని తెలిపారు. ఉదయం చూడడానికి గాంజాయిలా ఉన్న ఇందులో టీహెచ్సీ రసాయన పదార్థం 26 శాతం అధికంగా ఉంటుందని వివరించారు.దీనిని ఓజి, కుష్ పేర్లతో కూడా పిలుస్తారని తెలిపారు.
===========================