సిరా న్యూస్,కడప;
ఎటువంటి ఆధారాలు లేకుండా గోపవరం పిపీ కుంట చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసి బస్సులో డబ్బులు తరలిస్తున్నారని సమాచారం తో గోపవరం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు ఆర్టీసి బస్సులో ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 45 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్ పట్టణానికి చెందిన నరసింహ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. ఇన్ కామ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని మైదుకూరు డిఎస్పీ వంశీధర గౌడ్ తెలిపారు.