సిరా న్యూస్,హైదరాబాద్;
మోకాలితో పాటు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి శస్త్ర చికిత్స లేకుండా చికిత్సల అందిస్తున్న ఇపియాన్ పెయిన్ క్లినిక్ 50వేల మందికి విజయవంతంగా చికిత్సలు అందించినట్లు ప్రకటించింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సుధీర్, వైద్యురాలు మీనన్ తో కలిసి మాట్లాడారు. వివిధ కారణాలతో మోకాలి సమస్యలతో బాధపడుతున్న వారికి శస్త్ర చికిత్స లేని వైద్యం అందించాలని లక్ష్యంతో 2013 నుంచి 2016 వరకు ప్రయత్నాలు చేసి మెరుగైన వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. గతంలో చిన్నపాటి సమస్యతో ఆసుపత్రులకు వెళ్లే వారికి భారీ సతశిక్ష నిర్వహించాల్సి వచ్చేదని అన్నారు. తాము అందుబాటులోకి తెచ్చిన పిఆర్పి విధానంతో రోగి నుంచి సేకరించిన రక్త కణాలతోనే మెరుగైన చికిత్సలు అందించగలుగుతున్నట్లు చెప్పారు. 50,000 మంది రోగులకు మెరుగైన వైద్యం అందించడం గర్వంగా ఉందని అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా మరో 20 సెంటలను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు.