నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా నగరంలో 5 కే రన్

సిరా న్యూస్,అనంతపురం;
ప్రతిరోజు ప్రజలంతా అరగంట పాటు ఆరోగ్యం, ఫిట్నెస్ లేదా ఏదైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొనేలా దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డి.ఎస్.డి.ఓ షఫీ, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజని, ఆయన క్రీడలకు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఆగస్టు 29వ తేదీ నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి 5కే రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *