బద్వేల్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే డాక్టర్ సుధా
 సిరా న్యూస్,బద్వేలు;
78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బద్వేల్ నియోజక వర్గ శాసన సభ్యురాలు డా.దాసరి సుధా ప్రభుత్వ ఆసుపత్రి నందు,బద్వేల్ మున్సిపాలిటీ శ్రీ నాగభూషణం కళాశాల నందు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగింది.అనంతరం మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అని తెలిపారు. ఈ రోజు మన దేశం ప్రపంచం లోని ఒక బలమైన 5 వ ఆర్థిక దేశంగా అవతరించి అబ్దివృద్ధి వైపుగా దూసుకెళ్తోంది. ఈ రోజు మన దేశం అన్ని రంగాలలో ఇతర దేశాలకు ఆదర్శంగా ఉంది అని తెలిపారు.కావున ప్రతి ఒక్కరూ దేశ భక్తిని పెంపొందించుకుని దేశ అభివృద్ధి కి పాటుపడాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి,వైస్ చైర్మన్ సాయి ,గోపాల్ స్వామి, అందరూ కౌన్సిలర్లు,ముఖ్య నాయకులు,అధికారులు,ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *