సిరా న్యూస్,హైదరాబాద్;
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి పాపన్న గూడా చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న తండ్రి కొడుకుని టిప్పర్ ఢీకొంది. కుత్బుల్లాపూర్ కి కుమార్, కొడుకు ప్రదీప్ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద సమయంలో టిప్పర్ క్యాబిన్ భాగంలో మంటలు చేలరేగి టిప్పర్ ముందుభాగం పూర్తి దగ్ధం అయింది. టిప్పర్ డ్రైవర్ పరారీలో వున్నాడు. తండ్రి కొడుకు మృతి చెందడంతో కుత్బుల్లాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.