ఇదీ బీజేపీ మేనిఫెస్టో……..

హైదరాబాద్,(సిరా న్యూస్);
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. చేపట్టబోయే 10 అంశాలకు సంబంధించిన కార్యాచరణను మేనిఫెస్టోలో పొందుపరిచింది. సకలజనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. సకల జనుల సౌభాగ్య.. పేరుతో రూపొందించిన మేనిఫెస్టోలో.. బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రజలందరికీ సుపరిపాలన, సమర్థవంతమైన పాలనపై దృష్టి పెట్టనున్నట్టు అమిత్‌ షా తెలిపారు. అవినీతిని ఉక్కుపాతంతో అణచివేయటంతోపాటు ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా.. సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్‌… సబ్‌ కా విశ్వాస్, సబ్‌ కా ప్రయాస్‌.. నినాదంతో పాలన సాగిస్తామని తెలిపారు.
మహిళలకు పది లక్షల ఉద్యోగాలు..
రైతే రాజు– అన్నదాతలకు అందలం
విద్యాశ్రీ– నాణ్యమైన విద్య
ప్రజలందరికీ సుపరిపాలన– సమర్థవంతమైన పాలన
యువశక్తి–ఉపాధి
వారసత్వం–సంస్కృతి చరిత్ర
సంపూర్ణ వికాసం– పరిశ్రమలు, మౌలిక వసతులు
నారీశక్తి– మహిళల నేతృత్వంలో అభివృద్ధి
వైద్యశ్రీ– నాణ్యమైన వైద్యసంరక్షణ
వెనుకబడిన వర్గాల సాధికారికత– అందరికీ చట్టం సమానంగా వర్తింపు
కూడు–గూడు ఆహార నివాస భద్రత. అంశాలను చేర్చింది.
బీఆర్‌ఎస్, బీజేపీ మేనిఫెస్టోలో ఉచితాలు ఎక్కువగా కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్‌లో మాత్రం చాలా వరకు ఆకర్షణీయ అంశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మూడు పార్టీల మేనిఫెస్టోపై చర్చ జరుగుతోంది. ఆకర్షణీయంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఉండగా, తర్వాత స్థానంలో బీఆర్‌ఎస్, చివరన బీజేపీ మేనిఫెస్టో ఉన్నాయి. ఇక అన్ని పార్టీలు విద్య, ఆరోగ్యానికి అధిక ప్రధాన్యం ఇచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్‌ రూ.10 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని తెలుపగా, బీఆర్‌ఎస్‌ రూ.15 లక్షలకు పెంచుతామని ప్రకటించింది. విద్యకు అన్ని పార్టీలు ప్రత్యేక పాఠశాలలు, గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. ఇక కాంగ్రెస్, బీజేపీ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యం ఇచ్చాయి. గతంలో బీఆర్‌ఎస్‌ గెలుపులో ఈ అంశం కీలకంగా మారింది. కానీ, ఈసారి బీఆర్‌ఎస్‌ దానిని విస్మరించింది. మేనిఫెస్టోలో పేర్కొనలేదు. దీంతో కాంగ్రెస్, బీజేపీ దానిని కీలకంగా తమ మేనిఫెస్టోలో పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని ప్రకటించగా, బీజేపీ 10 లక్షల మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తామని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *