సిరా న్యూస్,వరంగల్;
కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై గురి పెట్టింది. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు ఎర వేయడంతో ఒక్కరొక్కరు హస్తం గూటికి ధారపడుతున్నారు. తాజాగా వరంగల్ పశ్చిమ నియోజవర్గానికి చెందిన ఆరుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, పలువురు ముఖ్య నేతలు కారు దిగి కాంగ్రెస్కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. వరంగల్ కార్పొరేషన్ లో.. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 48 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 10 స్థానాలు గెలిచి రెండో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకుని మూడో స్థానంలో నిలిచింది. స్వతంత్రులు ఒకటి గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్పొరేటర్లపై గురి పెట్టింది. ఇందులో భాగంగా బుధవారం ఆరుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా, మరో 15 మంది కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్లు హస్తం గూటికి చేరిన వారిలో ఉన్నారు. బీజేపీ నుంచి సైతం ఇద్దరు కార్పొరేటర్లు చేరారు. వరంగల్ తూర్పు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోందిఇంకా ఎంతమంది కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లిస్టులో ఉన్నారు..? జీడబ్ల్యూఎంసీ మేయర్ పీఠం స్వాధీనం చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత..? అవిశ్వాసం సాధ్యమేనా..దీంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలతో కుర్చీలు హస్తం వశం అవుతుండగా, రాష్ట్రంలో కీలకమైన గ్రేటర్ మేయర్ సీటుపై మూడు రంగుల జెండాను ఎత్తాలని కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ పశ్చిమ నియజక వర్గానికి చెందిన ఆరుగురు బీఆర్ఎస్ కార్పోరేటర్లు, ఐదుగురు మాజీ కార్పరేటర్లు, పలువురు ముఖ్య నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో గ్రేటర్ వరంగల్లో పట్టు సారిస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే జీడబ్ల్యూఎంసీ మేయర్ పీఠం దక్కించు కోవడం కోసం గతవారం రోజులుగా వరంగల్ పశ్చిమ MLA, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి చేస్తున్న మంతనాలు ఫలించాయి. ఆరుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..నాయిని రాజేందర్ రెడ్డి ఆపరేషన్ సక్సెస్ అవడంతో వరంగల్ తూర్పు, వర్దన్నపేట లోనూ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఎనిమిది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లతో మంత్రి కొండా సురేఖ, కొండా మురళి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. రేపో మాపో వారు కూడా కొండా మురళి నేతృత్వం లో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని సమాచారం. ఇక వర్ధన్నపేట నియోజక వర్గం పరిధిలో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరడానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే KR నాగరాజు వారితో మంతనాలు జరుపుకుంటున్నారు. రేపోమాపో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కాబోతున్నట్లు సమాచారం..ఈ క్రమంలోనే అవిశ్వాసం ప్రవేశపెట్టి గ్రేటర్ వరంగల్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది. అయితే జీడబ్ల్యూఎంసీ లో ఎవరి బలమేంతా..? బలగమెంతా..? అవిశ్వాసానికి ఆస్కారం ఉందా అనే చర్చ జరుగుతుంది.