Congress for Mudirajs: ముదిరాజుల సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం…

సిరా న్యూస్, చిగురుమామిడి:

ముదిరాజుల సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం…

-ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి గీకురు రవీందర్

ముదిరాజుల సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి, జడ్పి ఫ్లోర్ లీడర్, చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. బి అర్ ఎస్ ప్రభుత్వ హయాంలో, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు ఒరిగిందేమీలేదన్నారు. గత 9 సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ ముదిరాజులను కేవలం ఓటు బ్యాంకుగానే గుర్తించి, రాజకీయ అవసరాల కోసం వాడుకుందని విమర్శించారు. ముదిరాజులను బిసి-డి నుండి ఏ గ్రూపుకు మార్చే జీవోను అమలు చేయక, ముదిరాజులను మోసం చేసిందనని మండిపడ్డారు. ముదిరాజులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా, నామినేట్ పోస్టులలో సైతం ప్రాధాన్యత కల్పించకుండా, ముదిరాజుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజులను బిసి-డి నుండి ఏ గ్రూపుకు మార్చుతామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించడం హర్షనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం, అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అడహక్ కమిటీలను ఏర్పాటు చేయడం, తద్వారా రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ ఎన్నికల వైపు అడుగులు వేయడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముదిరాజుల అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుందని అన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముదిరాజుల సంక్షేమం కోసం, మత్స్యకార సంఘాల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలో వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు ప్రకటించడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో ముదిరాజుల సమస్యల సాధనకు, సంఘాలన్నింటినీ ఏకతాటిపై తెచ్చి, సమగ్ర అభివృద్ధి సాధించేందుకు తగిన కార్యాచరణతో, సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు బొమ్మరవేణి తిరుపతి, భాషవెని శ్రీనివాసు, పూరం రాజేశం, నీర్ల సతీష్, అట్ల అనిల్, బుస్సా భీమన్న, నెల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *