ప్రజాపాలన కార్యక్రమన్ని సద్వినియోగం చేసుకోవాలి

సిరా న్యూస్, బేల:

ప్రజాపాలన కార్యక్రమన్ని సద్వినియోగం చేసుకోవాలి -మండల స్పెషల్ ఆఫీసర్ శంకర్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పట్టిన ప్రజాపాలన కార్యక్రమన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడీ గ్రామపంచాయతీలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 05 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజా పాలనకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్త రేషన్ కార్డుల కోసం 80 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. మొత్తం 762 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌతమ్, ఫీల్డ్ అసిస్టెంట్ దీపక్, కారోబారి జీ విఠల్, అంగన్వాడీ టీచర్లు,యువజన సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *