సిరా న్యూస్,జగ్గయ్యపేట;
పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ జ్యోతికి చెందిన లారీకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనపై స్థానికుల ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడి చేరుకునివిచారణ చేపట్టారు. గత కొంతకాలంగా ఆ ముగ్గురు వ్యక్తులు గ్రామంలో అలజడి సృష్టిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారని, గతంలో తమకు చెందిన వరి కోత యంత్రాన్ని కూడా ధ్వంసం చేశారని.. ఆ విషయంపైపోలీసులు ఫిర్యాదులు చేసినా సరిగా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలని సర్పంచి జ్యోతి, భర్త బ్రహ్మం డిమాండ్ చేస్తున్నారు.