సిరా న్యూస్, సూర్యపేట:
సూర్యపేటలో ఈ–కేవైసీ అవస్థలు
+ గ్యాస్ ఏజెన్సీల ముందు తప్పని పడిగాపులు
+ ఇబ్బందులు పడుతున్న మహిళలు
సూర్యపేట జిల్లాలో ఈ–కేవైసీ కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల్లో రూ. 500లకే గ్యాస్ అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకాని అర్హత పొందాలంటే ఈ–కేవైసీ తప్పనిసరి అని కొంత మంది పుకార్లు పుట్టించడంతో జనాలు గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూకడుతున్నారు. వాస్తవానికి ఈ–కేవైసీ తప్పనిసరి అని ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రానప్పటికీ కూడ, రాయితీపై సిలీండర్ రాదేమోనని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఏజెన్సీల్లో కూడ థంబ్ పనిచేయకపోవడంతో, సర్వర్ డౌన్ వంటి సమస్యలు ఉండటంతో గంటల తరబడి ఎదురుచూపు తప్పడం లేదు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని సరైన వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.