సిరా న్యూస్,నెల్లూరు
మున్సిపల్ కార్మికుల నిరసన దీక్ష 11వ రోజుకి చేరుకుంది. నెల్లూరు పట్టణం ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానమునందు మున్సిపల్ కార్మికులు సీఐటీయూ నగర శాఖ ఆధ్వర్యంలో పోర్లు దండాలతో వినూత్న నిరసన చేపట్టారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు సీఐటీయూ నగర శాఖ సభ్యులు పాల్గొన్నారు.