సిరా న్యూస్, ఇంద్రవెల్లి
జగదాంబదేవి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హర్కాపూర్ తాండాలోని జగదాంబ దేవి ఆలయాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ సందరర్శించారు. ఈ సందర్భంగా ఆయన హర్కాపూర్ సర్పంచ్ రాథోడ్ సేవంతాబాయి రోహీదాస్, ఇతర నాయకులు, గ్రామస్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్, ఇతర నాయకులు, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జును శాలువాతో సత్కరించారు. అక్కడి నుండి కొలంగూడ గ్రామంలోని కాంగ్రేస్ పార్టీ నాయకుడు చాకటి మానిక్ వివాహానికి హాజరై, వదువరులను ఆశీర్వదించారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు ముకాడే ఉత్తం, నాయకులు చౌహాన్ ఉమాజీ నాయక్, జాదవ్ దూద్రాం, రాథోడ్ సంతోష్, రాథోడ్ గంగారాం, జాధవ్ ననేష్, జాదవ్ గణేష్, తదితరులు పాల్గొన్నారు.