నడి సముద్రంలో భారత నేవీ సహసం

హైజాక్ అయిన నౌక, సిబ్బంది విడుదల
సిరా న్యూస్,న్యూఢిల్లీ;
సోమాలియా సరిహద్దులో కార్గో నౌక హైజా క్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న భారత నేవీ అధికారులు సదరు నౌక ఎంవీ లిలా నార్ఫోర్క్ ను ట్రేస్ చేసి అందులో 15 మం ది భారతీయుల జాడ గుర్తించడంతో పాటు 21 మంది క్రూ సిబ్బంది సురక్షి తంగా రక్షించారు.నౌక లైబీరియా నుంచి వెళ్తుండగా సోమాలియా ప్రాంతంలో దుండగులు హైజాక్ చేశారు. విషయం తెలు సుకున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్ర మత్తం అయింది. ఎప్పటికప్పుడు స్థానిక అధికా రుల తో చర్చలు జరుపుతూ నౌక జాడలు కనిపెట్టేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు నౌక జాడ కనుక్కుంది. ఇందుకోసం చెన్నై వార్ షిప్ లను కూడా రంగంలోకి దింపారు అధికారులు. డ్రోన్లు తదితర యంత్రాల సాయంతో జాడ తెలుసుకున్నారు. నౌకను చుట్టు ముట్టి హైజాక్ చేసిన వారిపై కాల్పులు కూడా జరిపా రు. భారతీయులతోపాటు 21 మంది ఇతర సిబ్బందిని రక్షించామని తెలిపారు. హైజాక్ సమాచారాన్ని బ్రిటిష్ మిలిటరీ ఆర్గనైజేషన్, యూకే మారిటం ట్రేడ్ ఆపరేష న్స్ తెలిపింది. సముద్రంలో వెళ్తున్న నౌకలను ట్రాక్ చేయడమే వీటి పని. భారత నావికాదళ ప్రధాన కార్యా లయం సముద్రం లో కార్యకలాపాలను నిశితంగా పరి శీలి స్తున్నట్లు అధికారులు తెలిపారు. హైజాక్ చేసిన ఓడను వెంటనే వదిలివేయమని హెచ్చరించిన చివరికి దాడులు జరిపి నౌకలో ఉన్న సిబ్బందిని రక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *