సిరా న్యూస్,ఖమ్మం;
ప్లాస్టిక్ తో భూగోళానికి ముప్పు పొంచి ఉన్నాదని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఖమ్మంలో లైఫ్ స్టైల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎకో క్లబ్ ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్- ప్రత్యామ్నాయ మార్గాలు’ అనే అంశంపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకపాత్రాభినయం,నాటికల పోటీలు నిర్వహించారు.
ప్లాస్టిక్ వాడకం వల్ల భూతాపం పెరుగుతున్నాదని ప్లాస్టిక్ వాడకాన్ని దాదాపు తగ్గించాలని విద్యా శాఖ అధికారులు విద్యార్డుల చేత నాటిక రూపంలో తెలియజేశారు. ఈ నాటిక పలువురిని ఆలోచరింప చేసే విధంగా ఉందని ప్రశంసించారు.నాటిక పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు
డి.ఈ.ఓ సోమశేఖర శర్మ బహుమతులను అందజేశారు. గోళ్లపాడు-పోలేపల్లి ఉన్నత పాఠశాలలో గణిత నైపుణ్య ప్రదర్శనను విద్యార్థులు నిర్వహించారు.