సిరా న్యూస్, ఆదిలాబాద్:
అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలి…
విద్యార్థులు చిన్నతనం నుండే తప్పనిసరిగా అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలని ఆదిలాబాద్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ దుర్గే శివాజీ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఫైర్ స్టేషన్ లో పాఠశాల విద్యార్థులకు డెమో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఇంజన్ పనిచేసే విధానం, అగ్ని అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే 108 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందిస్తే, ఫైర్ ఇంజన్ అక్కడకు వచ్చి మంటలు ఆర్పడం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఫైర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు