శ్రీ ఊళ్ళమ్మ తల్లి కుంభాభిషేకం సందర్భంగా ఎడ్ల బలప్రదర్శన
సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 1వ మునిసిపల్ కార్పొరేషన్ డివిజన్లో కోడూరుపాడు గ్రామంలో శ్రీ ఊళ్ళమ్మ తల్లి కుంభాభిషేకం సందర్భంగా ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనను శనివారం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు,రూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 1,2వ డివిజన్ల కార్పొరేటర్లు జానా నాగరాజ్ గౌడ్, పి .రామ్మోహన్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, లేబూరు పరమేశ్వర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ముచ్చకాయల వేణు యాదవ్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పాశం శ్రీనివాస్, యేసునాయుడు, వేలూరు శ్రీధర్ రెడ్డి, సిహెచ్ సూరిబాబు, వై శ్రీనివాసులురెడ్డి తదితరులతోపాటు స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీదారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.